నిద్రపోకుండా అమాంతం అల్లరి చేస్తున్నారని అమెరికాకు చెందిన ఓ మహిళ తన పిల్లలకు మత్తు ఇంజెక్షన్ వేసింది. ఆపై పిల్లలు హ్యాపీగా నిద్రపోయారు. వివరాల్లోకి వెళితే.. అమెరికా వాషింగ్టన్కు చెందిన అష్లీ అనే మహిళకు ముగ్గురు సంతానం. 6,4,2 వయస్సుల్లో ఉన్న ఈ పిల్లలు నిద్రపోయేందుకు మారాం చేశారు. ఇల్లంతా అల్లరి చేశారు.
అయితే పిల్లలకు స్టోరీలు చెప్పి నిద్రించకుండా అష్లీ ఏం చేస్తుందో తెలుసా? ముగ్గురికీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో హ్యాపీగా ముగ్గురు పిల్లలు నిద్రించారు. ఇలా కన్నబిడ్డలకే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి నిద్రపుచ్చడంపై బాలల సంఘాలు ఫైర్ అవుతున్నాయి. కన్నతల్లిగా నడుచుకోవాల్సిన ఆ మహిళ అమానుషంగా ప్రవర్తించడంపై కేసు నమోదైంది. దీంతో పోలీసులు అష్లీని అరెస్ట్ చేశారు.