యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆర్మీ సర్జికల్ దాడులు చేయడంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ను అంతర్జాతీయంగా ఒంటరి చేయాలని భారత్ ప్రయత్నాలు జరుపుతున్నాయి. పాక్ ఉగ్రవాదంపై భారత్తో పాటు పలు దేశాలు కూడా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాయి.
లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఫ్జల్ అన్నారు. హఫీజ్ పాక్లో ఏమైనా గుడ్లు పెడుతున్నాడా? అని ఆయన ప్రశ్నించారు. భారత్లో జరుగుతున్న ఉగ్రదాడుల వెనుక హఫీజ్ ఉన్నాడంటూ ఆరోపణలు వస్తోన్నా ఆ ఉగ్రవాదిపై చర్యలు తీసుకోవడంలో తమ దేశ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
విదేశీ వ్యవహారాల్లో తమ దేశం పాటిస్తోన్న తీరును కూడా ఆయన ప్రశ్నించారు. హఫీజ్ ఉగ్రవాది అని భారత్ అంతర్జాతీయంగా వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. హఫీజ్ విషయంలో పాక్ ఎంతో కఠిన వైఖరి అవలంబించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉగ్రవాదులపై చర్యలు చేపట్టి పాక్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలనుకుంటున్న ప్రపంచదేశాల ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.