చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని కలవనున్న జో-బైడెన్

శనివారం, 7 అక్టోబరు 2023 (15:27 IST)
అమెరికా అధ్యక్షుడు జో-బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని కలవనున్నట్లు తెలుస్తోంది. బలహీనపడిన చైనా, యూఎస్ మధ్య సంబంధాలను బలపరిచేందుకు ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కానున్నారు. 
 
నవంబరులో శాన్‌ఫ్రాన్సిస్కోలోని వైట్ హౌస్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగనున్నాయి. 
 
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, గత నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలిలో గ్రూప్ ఆఫ్ 20 సమ్మిట్ సందర్భంగా కలుసుకున్న తర్వాత రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల నాయకుల మధ్య వ్యక్తిగత సమావేశం ఇదే కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు