ఆస్ట్రేలియా-భారత్ క్రికెటర్ల మధ్య టెస్టు క్రికెట్ సిరీస్ ముగిసినా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై కాలుమోపినప్పటి నుంచి.. మైదానంతో పాటు మీడియా పాయింట్ల వద్ద ఆసీస్ సమరానికి సై అంది. స్టేడియంలో స్లెడ్జింగ్.. బయట కామెంట్స్తో ఢీ అంటే ఢీ అంటోంది. ఇక సిరీస్ ముగిసింది కదా అనుకుంటే.. ఆస్ట్రేలియా క్రికెటర్లు టీమిండియా క్రికెటర్లకు సారీ చెప్తూ సంజాయిషీ ఇచ్చుకోవడం మొదలెట్టారు.
ఈ ఘటనపై భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గురువారం వెటకారంగా ఓ ట్వీట్ చేశాడు.. ఈ సంవత్సరం నుంచి మార్చి 30న క్షమాపణ దినోత్సవం జరుపుకోవాలంటూ దీనిలో పేర్కొన్నాడు. ఎందుకిలా అన్నాడంటే.. ఐపీఎల్లో ఆడటం కోసమే కోహ్లి ఆసీస్తో చివరి టెస్టుకు దూరమైనట్లు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాడ్జ్ వ్యాఖ్యానించాడు. దీనిపై హాడ్జ్ కోహ్లీని క్షమాపణ కోరుతూ.. సోషల్మీడియాలో పెద్ద లేఖ ఉంచిన సంగతి తెలిసిందే.