ఐపీఎల్ ప్రియులకు గుడ్ న్యూస్: మూడు కొత్త రీఛార్జ్ ప్యాక్‌లు వచ్చేశాయ్!

గురువారం, 16 సెప్టెంబరు 2021 (18:27 IST)
భారతీ ఎయిర్‌టెల్ ఐపీఎల్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2021 సెప్టెంబర్19న తిరిగి ప్రారంభం కాబోతోంది. డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్లను అందించే మూడు కొత్త రీఛార్జ్ ప్యాక్‌లను విడుదల చేసింది. దీంతో వినియోగదారులు తమ మొబైల్ ద్వారానే టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. 
 
ఈ మూడు కొత్త ప్యాక్ (రూ.499, రూ.699, రూ.2798) లను రీఛార్జ్ చేసుకుంటే హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. రూ.499 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. 
 
అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందుతారు. ఇంకా, ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి. అయితే రూ.699 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వాలిడిటీతో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. రూ.2798 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వాలిడిటీతో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు