ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు షాక్.. రూ.49 ప్లాన్ ఇక లేదు

గురువారం, 29 జులై 2021 (13:27 IST)
ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు షాకిచ్చింది. ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ లో మార్పులు చేసింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ లో ఉన్న రూ.49 ప్లాన్ ను నిలిపివేసింది. దీని స్థానంలో రూ.79 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్లాన్ ధరను ఒకేసారి 60 శాతం పెంచింది ఎయిర్ టెల్. ఇక ధరల పెరుగుదలపై ఎయిర్ టెల్ ప్రతినిధులు మాట్లాడుతూ వినియోగదారుడికి మెరుగైన సేవలు అందించేందుకు ప్లాన్స్‌లో మార్పులు చేశామని తెలిపారు.
 
రూ.79 స్మార్ట్ రీఛార్జితో డబుల్ డేటా, నాలుగు రేట్లు ఎక్కువ అవుట్ గోయింగ్ కాల్స్ మాట్లాడవచ్చని తెలిపారు. రూ.79తో రీఛార్జి చేసుకుంటే 200 MB డేటా, రూ.64 టాక్ టైం రానుంది. ఒక సెకనుకు 1 పైసా ఛార్జ్ పడనుంది. ఈ ప్లాన్ కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ ఎస్ఎంఎస్‌లకు కోత విధించారు.
 
ఇక కొన్ని రాష్ట్రాల్లో రూ.49 ప్లాన్ అందుబాటులో ఉంది. వ్యాలిడిటీ తగ్గించి ప్లాన్‌ని కొనసాగిస్తున్నారు. రూ.49 రీఛార్జీతో గతంలో 28 రోజుల వ్యాలిడిటీ వచ్చేది. కానీ ఇప్పుడు 14 రోజులకు కుదించారు. 28 రోజుల వ్యాలిడిటీ రావాలంటే ఖచ్చితంగా రూ.79 స్మార్ట్ రీఛార్జీ చేసుకోవాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు