ఐఫోన్ ఎక్స్ ఫీచర్స్‌తో ఎంఐ 8.. త్వరలో భారత్‌లోకి...

శుక్రవారం, 1 జూన్ 2018 (07:06 IST)
చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ తన తాజా మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎంఐ8 పేరుతో దీన్ని రిలీజ్ చేసింది. ఐఫోన్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను తయారు చేయడం గమనార్హం. స్మార్ట్ ఫోన్లలో ఇదో విప్లవం అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
 
ఎందుకంటే.. లక్ష రూపాయల విలువ అయిన ఐఫోన్ ఎక్స్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయని.. డిస్ ప్లే లుక్ కూడా అలాగే ఉందని చెబుతున్నారు. చైనాలో గ్రాండ్‌గా ఈ ఫోన్ లాంఛింగ్ జరిగింది. జూన్ నెలాఖరులోపు భారత్‌లోకి అందుబాటులోకి రానుంది. 
 
ఫీచర్స్ ఎలా ఉన్నాయి..
ఎంఐ 8 డిస్ ప్లే 6.21 ఇంచ్. 88.81శాతం స్కీన్ డిస్ ప్లే ఉంది. స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో పని చేస్తోంది. ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సల్, ఫోన్ వెనక 12 మెగాపిక్సల్ రెండు కెమెరాలు ఉన్నాయి. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంది. మన ఫేస్ ద్వారా ఫోన్ అన్ లాక్ ఆప్షన్ కూడా ఉంది. ఐఫోన్ ఎక్స్ తర్వాత ఇందులోనే ఈ తరహా ఆప్షన్ ఉంది. మన ముఖాన్ని 3డీ సెన్సార్ తోనే ఫొటోగా మార్చుకునే సదుపాయం కూడా ఉంది.
 
ఇకపోతే, రెండు సిమ్స్ కార్డులు పెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా 4జీ ఓల్ట్‌తో పని చేస్తాయి. డ్యుయల్ బ్యాండ్ వైఫై ఉంది. 3400 ఎంఏహెస్ బ్యాటరీ. చార్జింగ్ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతుంది. ఎంఐ8 ఎక్స్ ప్లోరర్ ఫోన్ చూసినా, ఫీచర్స్ విన్నా అచ్చం ఐఫోన్ ఎక్స్ గుర్తుకొస్తుంది అంటున్నారు. 
 
6 జీబీ ర్యామ్, 64జీపీ ఇంటర్నెల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.28వేల 460గా నిర్ణయించారు. 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.31 వేల 620గా ఉంది. 256జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.34వేల 785గా ఉంది. అయితే ఐఫోన్ కావాలంటే లక్ష రూపాయలు పెట్టాలి.. బ్రాండ్‌తో సంబంధం లేకుండా అవే ఫీచర్స్‌లో ఎంఐ 8 మాత్రం అందుబాటులోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు