బంపర్ ఆఫర్‌ ప్రకటించిన ఎయిర్‌టెల్... జియోకు ధీటుగా

శనివారం, 4 మార్చి 2017 (18:23 IST)
దేశ టెలికాం రంగంలో ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా మిగిలిన ప్రైవేట్ కంపెనీలు కూడా భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ ఆఫర్ మేరకు... కేవలం రూ.345 రిచార్జ్‌తో రోజుకు 1 జీబీ డాటా చొప్పున 28 రోజులపాటు 28 జిబి డాటా, అపరిమిత లోకల్, నేషనల్ ఫోన్‌కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే 1 జిబి డాటాను పగలు 500 ఎంబీలు, రాత్రి సమయంలో 500 ఎంబీల చొప్పున వినియోగించుకునే పరిమితిని విధించింది. 
 
ఈ ఆఫర్‌ను పొందాలంటే 4జి మొబైల్ కలిగిన యూజర్లు మార్చి 31 లోపు రూ.345తో రిచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు చేయించుకున్న వారు తదుపరి 11 నెలలు ఇదే తరహా ఆఫర్‌ను పొందవచ్చు. జియో ప్రైమ్ ఆఫర్‌‌కు ఛాలెంజ్ విసురుతూ ఈ సరికొత్త ఆఫర్‌ను ఎయిర్ టెల్ ప్రకటించడం గమనార్హం. 
 
అలాగే, రూ.549తో రిచార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రం రోజుకు 1 జీపీ డాటాను ఎలాంటి ఆంక్షలు లేకుండా వినియోగించుకోవచ్చు. ఇది కూడా 28 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. అన్‌లిమిటెడ్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి