జియో దెబ్బకు ఎయిర్‌టెల్ బెంబేలు ... హాట్‌స్పాట్ ధర తగ్గింపు

బుధవారం, 13 డిశెంబరు 2017 (16:43 IST)
స్వదేశీ టెలికాం సునామీ రిలయన్స్ జియో దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు వణికిపోతున్నాయి. జియో అతి తక్కువ ధరలకే తన సేవలను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతూ, నెలకోసారి ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటిస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఎయిర్ టెల్ తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులోభాగంగా, తన 4జీ హాట్ స్పాట్ డివైస్‌ను ఇప్పుడు కేవలం రూ.999కే అందివ్వనున్నట్టు ప్రకటించింది. 
 
ఇప్పటివరకు ఎయిర్‌టెల్ అందిస్తూ వచ్చిన 4జీ హాట్‌స్పాట్ డివైస్ ధర రూ.1950గా ఉండేది. కానీ ఈ డివైస్ ధరను బుధవారం తగ్గించింది. దీంతో ఇప్పుడు కేవలం రూ.999కే ఈ డివైస్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇక జియో కూడా రూ.2,329 ఉన్న తన జియోఫై హాట్‌స్పాట్ డివైస్ ధరను ఈ మధ్యే రూ.999 చేసింది. దీంతో ఎయిర్‌టెల్ కూడా తన హాట్‌స్పాట్ డివైస్‌ను ఇదే ధరకు అందిస్తూ జియోకు పోటీగా నిలిచింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు