ఉద్యోగులకు షాకివ్వనున్న కాగ్నిజెంట్... 7 వేల మంది టెక్కీలకు ఉద్వాసన?!

గురువారం, 31 అక్టోబరు 2019 (20:21 IST)
దేశంలోని సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీల్లో కాగ్నిజెంట్ ఒకటి. తమ వద్ద పని చేసే టెక్కీలకు ఈ కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. వచ్చే రాబోయే త్రైమాసికంలో సుమారుగా ఏడు వేల మంది టెక్కీలను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత మరో ఆరు వేల మంది ఉద్యోగులపై వేటు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
అమెరికాకు చెందిన ఈ కంపెనీ కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించింది. ఈ కారణంగానే కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, కంపెనీ నుంచి తొలి దశలో తొలగించాలని భావిస్తున్న ఐదు వేల మందిని మళ్లీ తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
వారికి కొత్తగా మళ్లీ శిక్షణ ఇచ్చి.. ఇతర స్థాయి ఉద్యోగాల్లో నియమించే అవకాశం ఉంది. అంటే.. మొత్తం మీద దాదాపు 7000 మంది ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది. ఇదేగానీ జరిగితే.. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 2 శాతం మందిని తొలగించినట్లు అవుతుంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో కూడా కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు