ట్విట్టర్‌ Vs కేంద్ర ప్రభుత్వం.. గెలుపు ఎవరిది?

సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (14:00 IST)
ట్రాక్టర్‌ ర్యాలీలో తలెత్తిన హింసాకాండ నేపథ్యంలో.. కేంద్రం గతంలో రైతులకు సంబంధించి గతంలో 250 ఖాతాలను తొలగించాలని కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఖాతాలను పునరుద్ధరించే అంశంపై ట్విటర్‌కు, కేంద్రానికి మధ్య కసరత్తులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఖలిస్తాన్‌ సానుభూతిపరులతో, పాకిస్థాన్‌ మద్దతు కలిగి వుందని ఆరోపిస్తూ.. రైతుల నిరసనకు సంబంధించిన 1200 ఖాతాలపై వేటు వేయాలంటూ కేంద్రం ట్విట్టర్‌ను కోరింది. భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న రైతుల నిరసనల దృష్ట్యా విదేశాల నుండి పనిచేస్తున్న ఈ సంస్థల ట్వీట్లతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ట్విటర్‌ను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
రైతు నిరసనలపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ట్విటర్‌ ఇంకా ఈ ఉత్తర్వులపై స్పందించలేదని, ఫిబ్రవరి 4న ఈ జాబితాను కంపెనీకి అందించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ట్విటర్‌ సిఇఒ జాక్‌డోర్సే నిరసనకు మద్దతు ఇచ్చిన కొన్ని ట్వీట్లకు మద్దతు తెలపడంతో .. ఖాతాలను తొలగించకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తటస్థ వైఖరిపై ట్విటర్‌ ప్రభుత్వం నుండి విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు