రిలయన్స్ జియో ప్రభావంతో 4జీ మొబైళ్ల అమ్మకం జోరందుకుంది. 4జీ సేవలను మూడు మాసాలు జియో ఉచితంగా ప్రకటించడంతో వినియోగదారులు 4జీ మొబైళ్లను పోటాపోటీగా కొనేస్తున్నారు. ఈ మొబైళ్ల కొనుగోలు అత్యధిక శాతం ఆన్లైన్లో జరుగుతోంది. దీంతో భారత్లోని ఈ-కామర్స్ దిగ్గజాల్లో పోటీ పెరిగిపోతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఫ్లిప్కార్ట్ సీఈవో డోర్ డెలివరీ ద్వారా సేల్స్ ఎగ్జిక్యూటివ్లా వెళ్లి ఫస్ట్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఐఫోన్ 7ను అందించనున్నారు. అంతేకాదు, ఈ ఫోన్ కొన్నవారికి ఫ్లిప్కార్ట్ సర్ప్రైజ్ కూడా ఇవ్వనుందట. అమ్మకాలు పెంచుకోవడానికి, వినియోగదారులను ఆకర్షించడానికి ఫ్లిప్కార్ట్ ఈ డోర్ డెలివరీ స్ట్రాటజీని అమలు చేస్తోందని ఐటీ నిపుణులు అంటున్నారు.