5జీ ఆధారిత రియల్‌మీ X7 స్మార్ట్‌ఫోన్.. ధర రూ.19,999 నుంచి మొదలు

గురువారం, 4 ఫిబ్రవరి 2021 (21:21 IST)
Realme X7
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ X7 సిరీస్‌లో 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రియల్‌మీ ఎక్స్‌ 7 ప్రొ, రియల్‌మీ ఎక్స్‌ 7 స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో లాంచ్‌ చేసింది. యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా వీటిని ఆవిష్కరించింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
 
భారత్‌లో రియల్‌మీ 5జీ మిడ్‌ రేంజ్‌ ఫోన్ల ప్రారంభ ధర రూ.19,999 నుంచి మొదలవనుంది. రియల్‌మీ ఎక్స్‌ 7 ప్రొ ప్రారంభం ధర రూ.29,999గా నిర్ణయించారు.
ఎక్స్‌ 7 5జీ సిరీస్‌ ఫోన్లలో సెల్ఫీ కెమెరా పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తున్నాయి. 
 
రియల్‌మీ X7 5G స్పెసిఫికేషన్లు:
ఫ్రంట్‌ కెమెరా:16 మెగా పిక్సెల్‌
రియర్‌ కెమెరా: 64+8+2 మెగా పిక్సెల్‌
ర్యామ్‌:6జీబీ
స్టోరేజ్‌:128జీబీ
బ్యాటరీ కెపాసిటీ:4310mAh
డిస్‌ప్లే:6.40 అంగుళాలు
ప్రాసెసర్‌:మీడియాటెక్‌ డైమెన్సిటీ 800యూ
ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు