'డేటా కీ ఆజాదీ' ఆఫర్.. రూ.70కే యేడాదంతా అపరిమిత డేటా

మంగళవారం, 15 ఆగస్టు 2017 (12:16 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ మొబైల్ కంపెనీ 'డేటా కీ ఆజాదీ' పేరుతో ఓ ఆఫర్‌ను వెల్లడించింది. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఆగస్టు 14వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నం లోపు రూ.70తో రీచార్జ్ చేసుకుంటే ఒక యేడాది పాటు ఉచితంగా అపరిమిత 2జీ డేటాను పొందవచ్చని తెలిపింది.
 
'డేటా కీ ఆజాదీ' ఆఫర్ పేరుతో ఈ స‌దుపాయాన్ని అందిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ ఆఫ‌ర్‌లో డేటా మాత్ర‌మే కాకుండా 56 రూపాయల టాక్‌ టైమ్‌ను కూడా అందుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఇటీవ‌లే ఇదే కంపెనీ రూ.299 నెలవారీ రెంటల్‌ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, టెక్ట్స్‌, డేటాను అందించనున్నట్టు ప్రకటించిన విష‌యం తెలిసిందే. మార్కెట్లో జియో ఇస్తోన్న పోటీతో మిగ‌తా కంపెనీలన్నీ పోటీలు ప‌డి ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఇందులోభాగంగా, రిలయన్స్ కూడా ఈ తరహా ఆఫర్‌ను వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి