జియోమీ- ఎమ్ఐ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లు

శుక్రవారం, 4 జనవరి 2019 (17:19 IST)
జియోమీ నుంచి ఎమ్ఐ ఏ3, జియోమీ ఎమ్ఐ 9 ఫీచర్స్ లీకయ్యాయి. ముందుగా జియోమీ ఎమ్ఐ9లో 48 మెగా పిక్సల్ సెన్సార్, 32డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ వున్నట్లు సమాచారం లీకైంది. జియోమీ ఎమ్ఐ 8 కొనసాగింపుగా ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.
 
ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 855 ఎస్ఓసీ స్నాప్‌డ్రాగన్, 48-మెగాపిక్సల్, సోనీ ఐఎమ్ఎక్స్586 సెన్సార్, 32డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 24 మెగాపిక్సల్ సెల్ఫీ స్నాపర్, 6.4 ఇంచ్ డిస్‌ప్లే, ఎమ్ఐయూఐ సాఫ్ట్‌వేర్, 3,500ఎమ్ఏహెచ్ బ్యాటరీలను ఈ ఫోన్ కలిగివుంటుందని ఆన్‌లైన్‌లో ఫీచర్స్ లీకయ్యాయి. జియోమీ ఎమ్ఐ 9 మార్చిలో చైనాలో విడుదల కానుందని సమాచారం. దీనిధర రూ.30,400 పలుకుతుందని టాక్. వాటర్ డ్రాప్ షేప్డ్ నోచ్, బాటమ్‌‍లో స్లైట్ చిన్‌ను ఇది కలిగివుంటుంది. 
 
మరోవైపు రెడ్‌మీ నుంచి నోట్ 5 ప్రో భారత్‌ మార్కెట్లోకి వచ్చేసింది. దీనిధర రూ.11,339. ఇందులో యాక్సిడెంటల్ కెమెరాను పిక్స్ చేశారు. ఇది థమ్‌నైల్స్, ఐకాన్స్ ఫిక్స్ చేయగలదు. ఎమ్ఐయూఐ వర్షన్‌లో పనిచేసే ఈ ఫోన్ 64జీబీ, 4జీబీ రామ్‌ను కలిగివుంటుంది. ఇకపోతే.. జియోమీ నుంచి ఎమ్ఐ ఏ3 కూడా విడుదలకు సిద్ధమైంది. రూ.15,250కి ఈ ఫోన్ అందుబాటులోకి వుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు