తాత్పర్యం : బుద్ధి తక్కువ వాడికి అధికారం ఇచ్చినట్లైతే, మిడిసిపాటుతో చెలరేగి ఉత్తములైన వారిని అవమానించి, దూరంగా తరిమి వేస్తారట. అల్పుల స్వభావమే అంత. వాళ్ల స్వభావం కుక్క స్వభావం లాంటిది, చెప్పులు తినే కుక్కకు చెరకు రుచి తెలియదని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి అల్పులకు అధికారం కట్టబెట్టవద్దని ఈ పద్యం ద్వారా హెచ్చరించాడు వేమన.