రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

ఠాగూర్

గురువారం, 29 మే 2025 (19:32 IST)
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన తాజా చిత్రం "పరమ్ సుందరి". ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఈ చిత్రం పరం, సుందరి మధ్య ప్రేమకథగా సాగనుందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సాంస్కృతి భేదాలు, హాస్యభరితమైన సన్నివేశాలు సినిమాకు హైలెట్‍‌గా నిలువనున్నాయి. 
 
ఈ టీజర్‌లో కేరళలోని అందమైన బ్యాక్ వాటర్స్, హౌస్‌బోట్ల నేపథ్యంలో అద్భుతంగా ఉంది. సిద్ధార్థ్ జాన్వీ ఒక బైకుపై రొమాన్స్ చేస్తూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌‍లో సోను నిగమ్ ఆలపించిన మధురమైన పాట హైలెట్‌గా నిలిచింది. దినేశ్ విజన్ నిర్మించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో తుషారా జలోటా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రాజీవ్ ఖండేల్వాల్, ఆకాశ్ దహియా తదితరులు కీలక పాత్రలను పోషించారు. పరమ్ సుందరి  చిత్రం జూలై 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు