రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇద్దరూ అందుకు పనికిరారు... అన్నా

శుక్రవారం, 26 జులై 2013 (21:39 IST)
FILE
కాబోయే ప్రధానమంత్రులు అంటూ అటు కాంగ్రెస్, ఇటు భాజపా రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీల పేర్లను చెపుతూ ప్రచారం చేసుకుంటున్నాయి కదా. దీనిపై సామాజికవేత్త అన్నాహజారే మండిపడ్డారు. అసలు వాళ్లిద్దరూ ప్రధానమంత్రి పదవులకు పనికిరారని తేల్చి చెప్పారు. దేశానికి ప్రధానులుగా ఉండేదుకు వారు అనర్హులన్నారు. ఎంతో హుందాతోనూ, ఉన్నతమైన పదవికి వారు ఎలా చూసినా సరితూగరంటూ వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ... తను ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటివరకూ లోకాయుక్త బిల్లును ప్రవేశపెట్టని నరేంద్ర మోడీ ఇక దేశాన్నే ఉద్ధరిస్తారంటూ విమర్శించారు. అక్కడ లోకాయుక్త లేకపోవడంతో అవినీతి పుచ్చిపోయిందని విమర్శించారు.

ఏసీ రూముల్లో కూర్చుని పేదలకు న్యాయం చేస్తున్నామంటూ చెప్పుకునే పార్టీలకు చెందిన నేతల వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రధాని పదవికి అనర్హులన్నారు.

వెబ్దునియా పై చదవండి