ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర భారతంలోని నదులు పొంగడానికి సిద్ధంగా ఉన్నాయి. వరద నీరు భారీ స్థాయిలో నదుల్లో చేరడంతో నదుల్లో నీటి ప్రవాహం ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. గాలివానలు, పిడుగుపాటుతో కూడిన వర్షం కారణంగా 12 మంది మృతిచెందారు.
అజాంఘడ్లోని అసండీహ్ గ్రామంలో పాఠశాల గేటు కూలి ఇద్దరు చిన్నారులు, ఫరుఖహాబాద్లో పిడుగుపాటుకు నలుగురు చనిపోయారు. మధురాలో కరెంట్ షాక్ తగిలి ఒకరు మృతి చెందారు. వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.