ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్ ... 19 మంది మృత్యువాత

గురువారం, 20 ఫిబ్రవరి 2020 (09:58 IST)
తమిళనాడు రాష్ట్రంలో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సును ఓ కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరో 31 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. 
 
ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు సమీపంలో ఉన్న అవినాసి వద్ద జరిగింది. తిరుప్పూరు నుంచి తిరువనంతపురం వెళ్తున్న కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును అతివేగంతో వచ్చిన ఓ కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు.. అంబులెన్స్‌లను రప్పించి, క్షతగాత్రులను తిరుప్పూరు, కోయంబత్తూరు జిల్లాల ప్రధాన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు