అయితే.. ఆడుకుంటున్న తమ బిడ్డ కనిపించలేదని జూన్ 13వ తేదీ సూరత్లోని సచిన్ పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. కానీ పార్కింగ్ ఏరియాలో నిల్చున్న కారు నుంచి దుర్వాసన రావడంతో జై వైభవ్ విల్లా అపార్ట్మెంట్ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారు తెరిచి చూస్తే బాలుడి మృతదేహం కుళ్ళిన స్థితిలో లభ్యమైంది.