స్కూల్ గర్ల్‌పై స్పీకర్ అత్యాచారం.. వాష్‌రూమ్‌కి లాక్కెళ్లి...

శనివారం, 14 అక్టోబరు 2017 (09:32 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ దారుణం జరిగింది. అన్యపుణ్యం తెలియని ఓ చిన్నారిపై పాఠశాలలో స్వీపర్‌గా పని చేసే కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబై నగర శివారు ప్రాంతంలోని కల్యాణ్ నగరంలోని ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖడేగోలివాలి ప్రాంతానికి చెందిన ప్రదీప్ మహాజన్ (47) స్వీపరుగా పనిచేస్తున్నాడు. ఆ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల బాలికను స్వీపర్ వాష్ రూంలోకి తీసుకువెళ్లి ఆమెను లైంగికంగా వేధించాడు. 
 
ఈ విషయం గురించి ఎవరికీ చెప్పవద్దని ప్రదీప్ బాలికను బెదిరించాడు. బాలిక రెండోరోజు లైంగికవేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు నిందితుడైన ప్రదీప్ మహాజన్‌ను అరెస్టు చేశారు. నిందితుడైన ప్రదీప్‌ను పాఠశాల స్వీపరుగా తొలగించామని పాఠశాల ప్రిన్పిపాల్ చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు