ఐస్ క్రీమ్ అంటే పిల్లలు ఇష్టపడి తింటుంటారు. అలాంటి ఐస్క్రీమ్లో చనిపోయి బాగా ఫ్రీజ్ అయిన బల్లి కనిపిస్తే అంతే.. ఐస్ క్రీమ్ను విసిరి పారేస్తాం. అలాంటి ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్లోని లూధియానాలో ఏడేళ్ల బాలుడి ఐస్ క్రీం లోపల ఫ్రీజ్ అయిన బల్లి కనిపించింది. ఆ కుటుంబం ఆ పిల్లవాడి కోసం వీధిలో అమ్మే ఐస్ క్రీమ్ వ్యాపారి వద్ద కొనిచ్చారు. ఇందుకోసం రూ.20 లను చెల్లించారు.