జీతం పెంచాలంటూ మేనేజర్‌ వద్దకు వెళ్తే..

గురువారం, 12 జనవరి 2023 (22:14 IST)
జీతం పెంచాలంటూ మేనేజర్ వద్దకు వెళ్లిన యువతిపై లైంగిక వేధింపుల ఘటన హర్యానా రాష్ట్రంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో 30 ఏళ్ల మహిళ పని చేస్తుండగా, ఆమె జీతం గురించి మాట్లాడేందుకు మేనేజర్ ఆమెను పిలిచాడు. 
 
ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన మేనేజర్ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అంతేకాదు తనపై మహిళ ఫిర్యాదు చేస్తే వీడియోను ఇంటర్నెట్‌లో లీక్ చేస్తానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు