2025 జూన్ 12న అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171, బోయింగ్ 787 డ్రీమ్లైనర్ టేకాఫ్ అయినప్పుడు కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం మేడే కాల్ జారీ చేసి విమానాశ్రయానికి సమీపంలోని ఆసుపత్రి హాస్టల్పైకి దూసుకెళ్లింది. హాస్టల్ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.
ఇక రాజస్థాన్లోని బలోత్రా నివాసి అయిన ఖుష్బూ విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఈ సంవత్సరం జనవరిలో లండన్లో నివసిస్తున్న డాక్టర్ విపుల్ రాజ్పురోహిత్ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత విపుల్ యూకేకి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ విషాదం జరిగింది.
ఆమె తండ్రి మదన్ సింగ్ రాజ్పురోహిత్ ఆమెతో పాటు విమానాశ్రయానికి వచ్చారు. ఇద్దరూ కలిసి ఒక చివరి భావోద్వేగ క్షణాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫోటో తీసుకున్నారు. అయితే ఇదే ఖుష్భూ చివరి ఫోటోగా మిగిలిపోయింది. ఆ తండ్రి కుమార్తెను విమానం ఎక్కించి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ప్రమాదం గురించి వార్త అందింది. దీంతో ఖుష్భూ తల్లిదండ్రులు, భర్త, అత్తమామలు తీవ్ర శోకంలో మునిగిపోయారు.