Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

సెల్వి

శుక్రవారం, 13 జూన్ 2025 (21:36 IST)
Kushboo Rajpurohit
యూకేకు ప్రయాణం ఒక కొత్త ప్రారంభం కావాలని ఆమె అనుకుంది. ఇరవై ఒక్క ఏళ్ల ఖుష్బూ రాజ్‌పురోహిత్ లండన్‌కు విమానం ఎక్కే ముందు అహ్మదాబాద్ విమానాశ్రయంలో తన తండ్రితో చివరి ఫోటో తీసుకుంది. ఈ ప్రయాణం ఆమె కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్న తన భర్తతో ఆమెను తిరిగి కలిపేలా చేస్తుంది అనుకున్నారు. కానీ కొన్ని క్షణాల తర్వాత, ఆమె ఎక్కిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయి 260 మందికి పైగా మరణించడంతో ఆ వీడ్కోలు ఒక భయంకరమైన విషాదంగా మారింది. 
 
2025 జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171, బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయినప్పుడు కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం మేడే కాల్ జారీ చేసి విమానాశ్రయానికి సమీపంలోని ఆసుపత్రి హాస్టల్‌పైకి దూసుకెళ్లింది. హాస్టల్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.
 
ఇక రాజస్థాన్‌లోని బలోత్రా నివాసి అయిన ఖుష్బూ విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటు ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఈ సంవత్సరం జనవరిలో లండన్‌లో నివసిస్తున్న డాక్టర్ విపుల్ రాజ్‌పురోహిత్‌ను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత విపుల్ యూకేకి తిరిగి వెళ్తున్నప్పుడు ఈ విషాదం జరిగింది. 
 
ఆమె తండ్రి మదన్ సింగ్ రాజ్‌పురోహిత్ ఆమెతో పాటు విమానాశ్రయానికి వచ్చారు. ఇద్దరూ కలిసి ఒక చివరి భావోద్వేగ క్షణాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫోటో తీసుకున్నారు. అయితే ఇదే ఖుష్భూ చివరి ఫోటోగా మిగిలిపోయింది. ఆ తండ్రి కుమార్తెను విమానం ఎక్కించి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ప్రమాదం గురించి వార్త అందింది. దీంతో ఖుష్భూ తల్లిదండ్రులు, భర్త, అత్తమామలు తీవ్ర శోకంలో మునిగిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు