దినకరన్ అబద్ధాల పుట్ట.. అతనో 420: ఓపీఎస్ మండిపాటు

సోమవారం, 25 డిశెంబరు 2017 (14:46 IST)
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శశికళ మేనల్లుడు, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన టీటీవీ దినకరన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీవీ దినకరన్ నోరు తెరిస్తే అసత్యాలు పలకడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. అతనొక 420 అని విషయాన్ని తన వద్ద స్వయంగా చెప్పారని ఓపీఎస్ అన్నారు.

ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ 40 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అన్నాడీఎంకేపై దినకరన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. దీనిపై ఓపీఎస్- ఈపీఎస్ వర్గం సీరియస్ అయ్యింది. 
 
ఓపీఎస్ దినకరన్‌పై మాట్లాడుతూ.. దినకరన్ అబద్ధాల పుట్ట అనేందుకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు. ఓపిఎస్‌ను తానే అమ్మకు పరిచయం చేశానని దినకరన్ అన్నారు. అయితే దినకరన్ కంటే 18 సంవత్సరాల ముందే తాను పార్టీలో పలు బాధ్యతలు చేపట్టానని ఓపీఎస్ వివరించారు. దినకరన్ అసత్యాలు పలికే వ్యక్తి అనేందుకు ఇంతకంటే నిజం ఏం కావాలన్నారు. 
 
రామాయణంలో మాయ లేడిలా దినకరన్ అని.. మాయ లేడి వల్ల ఏర్పడిన పరిణామాలేంటో అందరికీ తెలుసునని.. అలాంటి మాయాజాలంతో టీటీవీ ఆర్కేనగర్‌లో గెలిచాడని ఓపీఎస్ విమర్శించారు. ఏది ఏమైనా.. అమ్మ బాటలో నడుస్తూ ఆర్కే నగర్‌తో పాటు రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని ఓపీఎస్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు