ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా 126 విమానంలోనే టాయిలెట్ల సమస్య తలెత్తిందని, మొత్తం 12 టాయిలెట్లు ఉండగా, అందులో ఎనిమిది పని చేయడం లేదని సిబ్బంది గుర్తించారని సంస్థ పేర్కొంది. టాయిలెట్ పైపుల్లో పాలిథిన్ బ్యాగులు, దుస్తులు ఇరుక్కునిపోవడం వల్ల అవి పనిచేయడం లేదని తెలిపింది.
ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్టు తెలిపింది. ఆ సమయంలో విమానం అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తుండగా ఐరోపాలోని నగరాల్లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించారు. రాత్రి సమయం కావడం, అక్కడి విమానాశ్రయాల్లో ల్యాండింగ్పై ఆంక్షలు ఉండటంతో తిరిగి షికాగోకు మళ్లించాల్సి వచ్చిందని విమానయాన సంస్థ వెల్లడించింది.