డివైడర్‌ను ఢీకొట్టిని కారు.. తెరుచుకోని ఎయిర్‌బ్యాగులు - ఎమ్మెల్యే కుమారుడు మృతి

మంగళవారం, 31 ఆగస్టు 2021 (08:59 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని కోరమంగళ మార్స్ వెల్ఫేర్ హాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అమిత వేగంతో వచ్చిన ఓ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. 
 
మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. కారులో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఫ్రంట్ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగ‌తా న‌లుగురు కూర్చున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. 
 
మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వ‌య‌సున్న వారే.. మృతులను క‌రుణా సాగ‌ర్‌, బిందు (28), అక్ష‌య్ గోయ‌ల్, ఇషిత (21), ధ‌నూష (21), రోహిత్‌, ఉత్స‌వ్‌గా గుర్తించారు. వీరిలో క‌రుణా సాగ‌ర్‌, బిందు భార్యాభ‌ర్త‌లు. సెయింట్ జాన్స్ హాస్పిట‌ల్‌లో మృతదేహాల‌కు పోస్టుమార్టం నిర్వ‌హించారు.
 
అయితే, ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేద‌ని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఏడుగురిలో ఏ ఒక్క‌రూ కూడా సీటు బెల్ట్ ధ‌రించ‌లేద‌ని, అందుకే కారులోని ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగలలేదని పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు