రాజస్థాన్ ఆలయంలో బికినీ ఫోటో షూట్.. అందరూ చీరలు కట్టుకుని నిలబడితే.. విదేశీ మోడల్ మాత్రం?

శుక్రవారం, 13 జనవరి 2017 (14:14 IST)
ఓ సుప్రసిద్ధ ఆలయంలో హిందూ సంప్రదాయాలు మంటగలిసిపోయాయి. సంప్రదాయానికి అనుగుణంగా ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. పూజలో పాల్గొనే వారు సంప్రదాయ దుస్తుల్లో కనిపించాలని ఆలయ నిర్వాహకులు అంటున్నారు. ఈ క్రమంలో ఆలయాల్లో నైటీలు, లుంగీలు ధరించకూడదని అనేక ఆలయాల్లో నిషేధం విధించారు. 
 
అయితే రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో ప్రసిద్ధ ఆలయంలో విదేశీ మోడల్ బికినీలో ఫోటో షూట్ చేయడంతో స్థానికులు ఫైర్ అవుతున్నారు. ఆలయ నియమాలు ఉల్లంఘించి దేవుడి ప్రతిష్ట దిగజార్చిన వారి మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో ప్రసిద్ధి చెందిన దేవాలయం ఉంది. ఈ ఆలయంలో విదేశీ మోడల్‌తో బికినీలో ఫోటో షూట్ చెయ్యడానికి సిద్దం అయ్యారు. విదేశీ మోడల్ చుట్టూ కొందరు మహిళలు హిందూ సాంప్రదాయం ప్రకారం చీరలు కట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ సమయంలో విదేశీ మోడల్ బికినీ వేసుకుని అటూ ఇటూ తిరుగుతున్న సమయంలో ఫోటో షూట్ చేశారు. దీనిపై ఆలయ నిర్వాహకులపై స్థానికులు ఫైర్ అవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి