ఇండోపాక్ సరిహద్దుల్లో రూ.270 కోట్ల హెరాయిన్ పట్టివేత

శుక్రవారం, 4 జూన్ 2021 (10:00 IST)
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో 270 కోట్ల రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలను ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. ఇందులో అధికంగా హెరాయిన్ వుంది. దీన్ని పైపుల ద్వారా భారత్‌లోకి  పాకిస్థాన్ స్మగ్లర్లు అక్రమంగా చేరవేస్తున్నట్టు తేలింది. 
 
భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద రాజస్థాన్‌లో జరిగిందీ ఘటన. బికనేర్‌లోని కాజూవాలా ప్రాంతంలో నిన్న భారీ వర్షం కురిసింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న పాక్ స్మగ్లర్లు పీవీసీ పైపుల ద్వారా భారత్‌లోకి పెద్ద ఎత్తున హెరాయిన్‌ను పంపేందుకు ప్లాన్ వేశారు. 
 
ఈ విషయం తెలుసున్న భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) బలగాలు వెంటనే అప్రమత్తమై స్మగ్లర్లపై కాల్పులు ప్రారంభించాయి. అనంతరం నిర్వహించిన సోదాల్లో 54 ప్యాకెట్లలో 58.6 కిలోల బరువున్న హెరాయిన్‌ లభ్యమైంది. దీని విలువ రూ.270 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఇంత పెద్దమొత్తంలో మత్తుపదార్థాలు పట్టుబడడం ఇదే తొలిసారని బీఎస్ఎఫ్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు