కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి అరుదైన ఆహ్వానం!!

వరుణ్

బుధవారం, 17 జులై 2024 (11:21 IST)
కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, శ్రీకాకుళం టీడీపీ లోక్‌సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడుకి అరుదైన గౌరవం లభించింది. ఆయన నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. కేంద్రంలో కొత్తమంత్రి వర్గం ఏర్పడిన నేపథ్యంలో నీతి ఆయోగ కూర్పును సవరించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల జాబితాలో కొత్త వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చోటు కల్పించారు. 
 
అలాగే, ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో కేంద్రమంత్రులు జేపీ నడ్డా (వైద్య ఆరోగ్యం), కె.రామ్మోహన్ నాయుడు (పౌర విమానయాన శాఖ), హెచ్.డి కుమార స్వామి (ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ), జితన్ రాం మాంఝీ (ఎంఎస్ఎంఈ), రాజీవ్ రంజన్ సింగ్ (పంచాయతీ రాజ్, పశుసంవర్థకం), జూయెల్ ఓరం (గిరిజన వ్యవహారాలు), అన్నపూర్ణాదేవి (మహిళా శిశు సంక్షేమ), చిరాగ్ పాశ్వాన్ (ఆహారశుద్ధి, పరిశ్రమలు)లను చేర్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు