జయలలిత మృతి తర్వాత రాష్ట్రంలో రాజకీయంగా నిలదొక్కుకోవాలన్నా... బలపడాలన్నా ఇదే తగిన మంచి తరుణమని వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకెతో స్నేహంగా ఉంటూనే మరోవైపు రాజకీయ మైలేజీని పొందేందుకు ఈ జల్లికట్టుకుమించిన ఉపాయమేమీ లేదని కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అలోచిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ జల్లికట్టు పోటీల్లో పశుహింసకు కారణమవుతున్న ఈ సంప్రదాయాన్ని ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.