కేరళ రాష్ట్రంలోని కాసర్కోడ్లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. రీయూనియన్ పేరుతో 50 యేళ్ల తర్వాత సమావేశమైన స్నేహితులు కొట్టుకున్నారు. నాలుగో తరగతిలో జరిగిన ఓ గొడవను గుర్తుకు తెచ్చుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ బాల్యపు గొడవకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే,
కాసర్కోడ్ జిల్లాలో 50 యేళ్ల తర్వాత రీయూనియన్ పేరుతో ముగ్గురు స్నేహితులు కలుసుకున్నారు. వీరికి ప్రస్తుతం 62 యేళ్ళు. ఈ ముగ్గురు మిత్రుల పేర్లు బాలకృష్ణన్, వీజే బాబు, మాథ్యూ. వీరిలో బాలకృష్ణన్, వీజే బాబులు కాసరకోడ్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో కలిసి చదువుకున్నారు.
నాలుగో తరగతిలో ఉన్నపుడు వీరిద్దరి మధ్య గొడవ జరిగి బాలకృష్ణన్ను వీజే బాబు కొట్టారు. ఇది దాదాపు 1970లో జరిగింది. బాలకృష్ణన్ ఇటీవల తన స్నేహితుడైన మాథ్యూతో కలిసి బయటకు వెళ్ళగా, అక్కడ అనుకోకుండా వీజే బాబు కలిశారు.
చిన్ననాడు వీజే బాబు తనను కొట్టాడనే విషయాన్ని మనసులో పెట్టుకున్న బాలకృష్ణన్ మాటల మధ్యలో నాలుగు తరగతి నన్ను ఎందుకు కొట్టావని ప్రశ్నించాడు. మాటా మాటా పెరిగి బాబుబై దాడి చేశాడు. మాథ్యూ కూడా ఓ చేయి వేయడంతో గాయాలపాలైన వీజే బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తుపోయిన పోలీసులు బాబును కున్నూరు ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణన్, మాథ్యూను పోలీసులు అదుపులోకితీసుకుని విచారిస్తున్నారు.