వందేభారత్ రైలు భోజనంలో బొద్దింక- సారీ చెప్పిన ఐఆర్‌సీటీసీ

సెల్వి

గురువారం, 20 జూన్ 2024 (21:38 IST)
Cockroach
వందే భారత్ రైలు భోజనంలో బొద్దింక వచ్చింది. రైల్వే సిబ్బంది తీసుకువచ్చిన భోజనంలో బొద్దింకను గుర్తించారు. తన బంధువులు భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తున్నారని... రైల్వే సిబ్బంది తీసుకువచ్చిన భోజనంలో బొద్దింకను గుర్తించారు.
 
ఇలాంటి భోజనాన్ని సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఐఆర్‌సీటీసీ, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వేస్‌ను ట్యాగ్ చేస్తూ విదిత్ ట్వీట్ చేశారు. 
 
నెటిజన్ చేసిన ట్వీట్‌పై ఐఆర్‌సీటీసీ స్పందించింది. బంధువులకు ఎదురైన చేదు అనుభవానికి క్షమాపణలు కోరుతున్నామని.. ఐఆర్‌సీటీసీ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు