ఢిల్లీలో వేడిగాలులు-14 మంది మృతి.. యూపీలో కానిస్టేబుల్ ప్రాణం పోతున్నా..?

సెల్వి

గురువారం, 20 జూన్ 2024 (16:30 IST)
దేశ రాజధాని ఢిల్లీలో వేడిగాలుల కారణంగా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా 118 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ గురువారం తెలిపారు. దేశ రాజధానిలో గత కొన్ని రోజుల్లో 52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఇది గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉందని ఆయన పేర్కొన్నారు. 
 
గత కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రత 52 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇది గత 60 ఏళ్లలో అత్యధికం. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఉత్తర భారతదేశంలో వేడిగాలులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగింది. 310 మంది ప్రభుత్వాసుపత్రుల్లో చేరారు. 112 మంది డిశ్చార్జ్ అయ్యారు. 118 మంది ఇప్పటికీ అడ్మిట్‌లో ఉన్నారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారు.. అంటూ ఆయన వివరణ ఇచ్చారు.
 
అయితే ఎండ దెబ్బకి కానిస్టేబుల్ ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా తోటి ఉద్యోగులు వుండిపోయారు. యూపీలో ఓ కానిస్టేబుల్ ఎండ వేడికి వడ దెబ్బ కొట్టి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే.. తోటి ఉద్యోగులు సాయం చేయకుండా చోద్యం చూస్తూ మొబైల్లో వీడియో తీశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రాణాలు విడిచారు. అతని ప్రాణం పోయేంతవరకు అలానే వీడియో చూస్తుండిపోయారే కానీ.. ఆయన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

ఎండ దెబ్బకి కానిస్టేబుల్ ప్రాణాలు పోతున్నా పట్టించుకోని తోటి ఉద్యోగులు

యూపీలో - ఓ కానిస్టేబుల్ ఎండ వేడికి వడ దెబ్బ కొట్టి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే.. తోటి ఉద్యోగులు సాయం చేయకుండా చోద్యం చూస్తూ మొబైల్లో వీడియో తీశారు.

ఈ క్రమంలో కానిస్టేబుల్ ప్రాణాలు విడిచారు. pic.twitter.com/TYVycBdtZ8

— Telugu Scribe (@TeluguScribe) June 20, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు