బీజేపీ లీడర్ జీతూ చౌదరి దారుణ హత్య.. బైక్‌పై వచ్చారు.. కాల్చేశారు..

గురువారం, 21 ఏప్రియల్ 2022 (19:05 IST)
దేశ రాజధాని ఢిల్లీలోని మయూరు విహార్ ప్రాంతంలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు జీతూ చౌదరి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మయుర్​విహార్ ప్రాంతంలోని ఫేజ్ 3లో నివసించే జీతూ చౌదరి బుధవారం రాత్రి తన ఇంటి బయటకు వచ్చి నిల్చొని ఉన్నాడు. 
 
అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు వచ్చి జీతూపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ క్రమంలో తల, కడుపు భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. 
 
కాల్పులకు గురైన జీతూను స్థానికులు, కుటుంబసభ్యులు హుటాహుటిన నోయిడాలోని మెట్రో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జీతూ చౌదరి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు