లేజర్ కిరణాలతో లక్ష్యాలు ధ్వంసం ... డీఆర్డీవో మరో విజయం

గురువారం, 24 సెప్టెంబరు 2020 (09:15 IST)
భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) మరో అరుదైన ఘనతను సాధించింది. లేజర్ కిరణాల సాయంతో లక్ష్యాన్ని ఛేదించే ట్యాంకు విధ్వంసక క్షిపణిని (ఏటీజీఎం) బుధవారం విజయవంతంగా పరీక్షించింది. నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఈ క్షిపణి పూర్తి ఖచ్చితత్వంతో తుత్తినియలు చేస్తుందని అధికారులు తెలిపారు.
 
మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని ఆర్మర్డ్ కార్ప్స్ సెంటర్ అండ్ స్కూల్ (ఏసీసీ అండ్ఎస్)లో డీఆర్‌డీవో ఈ పరీక్షను నిర్వహించినట్టు రక్షణ రంగ అధికారులు వెల్లడించారు. మూడో తరానికి చెందిన ఎంబీటీ అర్జున్ యుద్ధ ట్యాంకుపై నుంచి దీనిని ప్రయోగించినట్టు తెలిపారు. క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ డీఆర్డీవో శాస్త్రవేత్తలను అభినందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు