అమెరికా నుంచి ఐపీఎల్‌ క్రికెటర్‌ ఇంటికొచ్చారు.. తిరిగి రాని లోకాలకు..?

సోమవారం, 23 అక్టోబరు 2023 (22:44 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ముంబైలోని వెస్ట్‌ కాందివాలిలోని మహావీర్‌ నగర్‌లోని పవన్‌ ధామ్‌ వీణా సంతూర్‌ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటుగా 8 సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. మరో ఐదుగురు గాయాలపాలైనారు. 
 
గాయపడిన ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. కాగా ప్రమాదం జరిగిన భవనంలో నాలుగో అంతస్థులో ఐపీఎల్‌ క్రికెటర్‌ పాల్‌ చంద్రశేఖర్‌ వాల్తాటి ఇల్లు కూడా ఉంది. మృతి చెందిన ఇద్దరు చంద్రశేఖర్‌ ఇంటికి వచ్చిన అతిధులని.. వారు అమెరికా నుండి వచ్చారని స్థానికులు తెలిపారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు