ట్రాక్టర్ ర్యాలీ: ఆస్ట్రేలియా నుంచి రాంపూర్‌కు... వివాహం కోసం వచ్చి ఆ రైతు..?

బుధవారం, 27 జనవరి 2021 (19:53 IST)
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మక రూపు దాల్చింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రైతుల నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఢిల్లీ ఐటీవో వద్ద ఆందోళనకారులే పోలీసులను తరిమికొట్టడం వీడియోల్లో కనిపించింది.

ఈ క్రమంలో ఢిల్లీ ఐటీవో వద్ద ఓ రైతు మృతి చెందడం రైతుల్లో ఆగ్రహావేశాలు కలిగిస్తోంది. పోలీసుల బుల్లెట్ తగిలి రైతు మరణించాడని ఇతర రైతులు ఆరోపిస్తున్నారు. అయితే రైతుల ఆరోపణలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ట్రాక్టర్ పైనుంచి కిందపడి చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. 
 
ట్రాక్టర్ బోల్తా పడటంతో ఐటిఓ నిరసనలో మరణించిన రైతు తన పెళ్లి వివాహం కోసం ఇటీవల ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చాడు. తన ఇటీవలి పెళ్లిని జరుపుకునేందుకు ఆస్ట్రేలియా నుంచి ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లోని తన స్వగ్రామానికి తిరిగి వచ్చారు. కానీ  రైతుల ట్రాక్టర్ పరేడ్‌లో పాల్గొన్న అతను ఢిల్లీలోని ఐటిఓ వద్ద పోలీసు బారికేడ్ను పగలగొట్టడానికి ప్రయత్నించినప్పుడు 27 ఏళ్ల ఆ రైతు తాను నడుపుతున్న ట్రాక్టర్ కింద పడగొట్టాడు.
 
ఈ క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో రైతు ప్రాణాలు కోల్పోయాడు. నవ్రీత్ సింగ్ అనే ఆ రైతు ట్రాక్టర్ అతి వేగంగా నడపిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వేగంగా బారీ కేడ్ల వద్ద దూసుకెళ్తుండగా.. అది బోల్తాపడి నవ్రీత్ సింగ్ రైతు మరణానికి కారణమైందని పోలీసులు తెలిపారు. నవ్రీత్ సింగ్ మృతదేహం మంగళవారం రాత్రి రాంపూర్‌కు చేరుకుందని, పోస్ట్‌మార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. 
 
కాగా, ఢిల్లీ ఐటీవో వద్ద ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లను మూసివేయించారు. రైతుల ఆందోళన మరింత ఉద్ధృతమవుతుందన్న అంచనాల నేపథ్యంలో విజయ్ చౌక్, పార్లమెంట్ భవన్, నార్త్ సౌత్ బ్లాక్ ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. సాధారణ ప్రజలు, పర్యాటకులు వెళ్లిపోవాలని పోలీసులు, భద్రతా సిబ్బంది హెచ్చరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు