ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది ప్రారంభంలో నిర్వహించనున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ‘దియోరియా టూ ఢిల్లీ యాత్ర’ పేరిట 2,500 కిలోమీటర్ల కిసాన్ పాదయాత్రను చేపట్టారు.
తాను, మోడీ సర్కారు పాకిస్థాన్పై తీసుకున్న చర్యకు తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘మోడీకి థ్యాంక్స్. ఎందుకంటే.. రెండున్నరేళ్ల క్రితం భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ చేసిన తొలి మంచి పని ఇదే’ అని ఆయన వ్యాఖ్యానించారు.