కుటుంబాలను మింగేస్తున్న కరోనా వైరస్ : చట్టబద్ధమైన దత్తత కోసం..

మంగళవారం, 18 మే 2021 (10:36 IST)
దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. అనేక మంది కుటంబాలను మింగేస్తోంది. ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తోంది. నిత్యం వేలాది మంది మృత్యువాత పడ్డారు. పడుతున్నారు. ఒక్కోసారి ఒక్కో ఇంటిలో ఇద్దరు ముగ్గురు కూడా కరోనా బారిన పడి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో అనేక మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఎందరో చిన్నారులు వీధిన పడుతున్నారు. 
 
అటువంటి పిల్లలను ఎవరైనా పెంచుకునే ప్రయత్నం చేయాలన్నా.. ప్రస్తుతం ఉన్న దత్తత చట్టం ప్రకారం దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ విధానం చాలా సమయాన్ని తీసుకుంటుంది. దీంతో కొందరు చట్టప్రకారం దత్తత లేకుండానే పిల్లలను పెంచుకోవడానికి తీసుకుంటున్నారు. 
 
దీనివలన పిల్లలకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకోసమే ప్రభుత్వం తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను కోవిడ్ -19కు పునరావాసం కల్పించే విధానాన్ని నిర్దేశించింది. ఈ మేరకు ఒక బహిరంగ నోటీసు విడుదల చేసింది. మహిళా పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోమవారం చట్టపరమైన నిబంధనలకు విరుద్ధమైన చర్యలకు పాల్పడటం లేదా ప్రోత్సహించడం మానేయాలని ఆ నోటీసులో కోరింది.
 
అనాథ బిడ్డను దత్తత తీసుకోవాలనుకునే ఏ వ్యక్తి అయినా “చట్టబద్ధమైన దత్తత” కోసం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (cara.nic.in)ను సంప్రదించవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను జాబితా చేస్తూ, కోవిడ్ -19లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లవాడిని 24 గంటల్లో జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సిడబ్ల్యుసి) ముందు హాజరుపరచాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. “సిడబ్ల్యుసి పిల్లల తక్షణ అవసరాన్ని నిర్ధారిస్తుంది. పునరావాసం కోసం తగిన ఆదేశాలు జారీ చేస్తుంది” అని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు