గుట్కా నమిని అసెంబ్లీలో ఊసిన యూపీ ఎమ్మెల్యే (Video)

ఠాగూర్

మంగళవారం, 4 మార్చి 2025 (13:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని కొందరు ఎమ్మెల్యేలు అపరిశుభ్రం చేశారు. గుట్కా నమిలి అసెంబ్లీ ఆవరణలోనే ఊశారు. దీన్ని గమనించిన అసెంబ్లీ స్పీకర్ ఆ పని చేసిన ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గుట్కా ఊసిన ఎమ్మెల్యే స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి చేసిన తప్పుకు క్షమాపణల కోరాలని లేనిపక్షంలో తానే వారిని గుర్తించి అసెంబ్లీ నుంచి బయటకు పంపిస్తానంటూ హెచ్చరించారు. 
 
ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళుతుండగా ప్రవేశద్వారం ఎవరో గోడపై గుట్కా నమిలి ఊశారు. దాన్ని గమనించిన స్పీకర్.. భద్రతా సిబ్బంది వద్ద ఆరా తీయగా, ఓ ఎమ్మెల్యే ఆ పని చేశారంటూ సమాధానమిచ్చారు. 
 
దీంతో ఆగ్రహించిన స్పీకర్.. ఈ పాడుపని చేసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేసిన తప్పును అంగీకరించకపోతే తానే వెల్లడించి, అసెంబ్లీ నుంచి వెళ్లగొడతానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

 

గుట్కా తిని అసెంబ్లీలో ఊసిన ఎమ్మెల్యే

యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీలోకి వెళ్తూండగా.. ఎంట్రీ వద్ద ఎవరో గోడ మీద గుట్కా తిని ఊసినట్లుగా గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బందిని ఆరా తీశారు. ఓ ఎమ్మెల్యే అలా చేశాడని గుర్తించారు.

ఈ పని చేసిన ఎమ్మెల్యే ఎవరో స్వచ్చందంగా… pic.twitter.com/s31HoxgLMD

— Telugu360 (@Telugu360) March 4, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు