హర్యానాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన ఎనిమిది నెలల బిడ్డతో కలిసి ఆటో ఎక్కిన మహిళలపై కామాంధులు కిరాతకంగా వ్యవహరించారు. ఏకంగా ముగ్గురు వ్యక్తులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాకుండా.. ఆమె చేతిలోని ఎనిమిది నెలల చిట్టితల్లిని రోడ్డుపైకి విసిరేశారు. ఈ ఘటనతో తలకు తీవ్రంగా గాయాలైన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మే 29న ఈ ఘటన జరగినప్పటినీ.. సోమవారమే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏడుస్తున్న పాపను బలవంతంగా తన చేతుల్లోంచి లాక్కుని రోడ్డుపైకి విసిరేశారని ఏడుస్తూ పేర్కొంది. తనపై అత్యాచారం చేసిన అనంతరం వారు పారిపోయారని వివరించింది. ఈ దుర్ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య, వేధింపుల కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.