తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న హిజ్రాలకు బంపర్ ఆఫర్ వచ్చింది. హిజ్రాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చునని తమిళనాడు సీఎం జయలలిత ఇచ్చిన పిలుపునకు హిజ్రాలు స్పందించారు. వేలాదిమంది ముందుకొచ్చి కౌన్సిలర్, జిల్లా పంచాయతీ మెంబర్, యూనియన్ కౌన్సిలర్ తదితర పదవులకు టికెట్లు కోరుతూ దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
కార్పొరేషన్ పరిధిలోని 40వ డివిజన్కు సుధ, 109వ డివిజన్కు నూరి, మధురై సౌత్ 74వ డివిజన్కు భారతి దరఖాస్తు చేసుకున్నారు. సుధ గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ సంపాదించేందుకు చేసిన ప్రయత్నం విఫలం కాగా భారతి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది.