బిల్లు విజయవంతంగా ఆమోదించబడటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, జెపిసి చైర్మన్ జగదాంబికా పాల్, వేలాది మంది ఎంఆర్ఎం కార్మికుల అవిశ్రాంత కృషికి ఎంఆర్ఎం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలియజేసింది.
ఈ బిల్లు కేవలం చట్టపరమైన సంస్కరణ మాత్రమే కాదని, సమాజంలోని అణగారిన వర్గాలకు, ముఖ్యంగా ముస్లిం సమాజంలోని వారికి విజయం అని ఆయన అన్నారు. ఈ కొత్త చట్టం నేపథ్యంలో ఐక్యత- సోదరభావం ప్రాముఖ్యతను గమనిస్తూ, విభజన రాజకీయ శక్తుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎంఆర్ఎం హెచ్చరించింది.
వక్ఫ్ ఆస్తులలో దోపిడీ, అవినీతిని అంతం చేసే దిశగా ఈ బిల్లు ఒక ప్రధాన అడుగు అని ఆ సంస్థ అభివర్ణించింది. "భారతదేశం 1947లో స్వాతంత్ర్యం పొందినప్పటికీ, ఈరోజు మాత్రమే వక్ఫ్ ఆస్తులు రాజకీయ అవకతవకలు, అవినీతి నుండి విముక్తి పొందాయని ఎంఆర్ఎం వెల్లడించింది.
ఈ సంస్కరణలో ప్రధాని మోదీ పేరును సువర్ణాక్షరాలతో లిఖించాలని పిలుపునిచ్చింది. ఈ బిల్లుపై అవగాహన పెంచడానికి, ప్రజల మద్దతును కూడగట్టడానికి, MRM కార్మికులు దేశవ్యాప్తంగా 5,000 కి పైగా బహిరంగ సమావేశాలు, సెమినార్లు, చర్చలు మరియు వ్యాస ప్రచారాలను నిర్వహించారు.