అవినీతిని నిరోధించడానికి ఓ పద్ధతి ప్రకారం చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవినీతికి పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిరోధించాల్సిన అవసరముందన్నారు. పేదలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలని, పేదరిక నిర్మూలనకు అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.