ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం ఆపరేషన్ అజయ్

గురువారం, 12 అక్టోబరు 2023 (12:29 IST)
ఇజ్రాయేల్, పాలస్తీనా దేశాల మధ్య భీకర స్థాయిలో యుద్ధం జరుగుతుంది. పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం.. గాజా నగరాన్ని ధ్వంసం చేసింది. వేలాది మంది ఉగ్రవాదులను ముట్టుబెట్టింది. గాజా స్ట్రిప్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో భారీ సంఖ్యలో భారతీయులు చిక్కుకునిపోయారు.
 
వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు వీలుగా భారత్ ఆపరేషన్ విజయ్‌‍ను చేపట్టనుంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ ఆపరేషన్ కోసం ప్రత్యేక విమానాలతో పాటు ఇతర ఏర్పాట్లను భారత ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. దేశ పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. 
 
ఇందుకోసం ప్రారంభించిన ఆపరేషన్ అజయ్ గురువారం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. కాగా, గతంలో రష్యా - ఉక్రెయిన్‌ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా చిక్కుకుని పోయిన భారతీయ విద్యార్థులు, పౌరులను ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకొచ్చిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు