ఎయిరిండియా బంపర్ ఆఫర్.. రూ.1470కే ప్రయాణ టిక్కెట్

శుక్రవారం, 18 ఆగస్టు 2023 (12:05 IST)
ఎయిరిండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రారంభ టిక్కెట్ ధరను రూ.1470గా నిర్ణియించింది. అలాగే, బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధరను కూడా రూ.10130కే కొనుగోలు చేసే వెసులుబాటును కల్పించింది. దేశీయ, ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల్లో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ ఆఫర్ గురువారం నుంచి మొదలైంది. ఆదివారం అర్థరాత్రి 11.59 నిమి,ాల వరకు అందుబాటులో ఉంటుంది. 96 గంటలపాటు అమల్లో ఉండే ఈ ఆఫర్‌లో ఎలాంటి ఇతర సౌకర్య రుసుము లేకుండా ప్రారంభ టిక్కెట్ ధరను ఖరారు చేసింది. 
 
ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీలోపు ప్రయాణించాల్సి ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వచ్చే పండగ సీజన్‌లో తక్కువ విమాన ప్రయాణం చేయాలనుకునేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిది. రిటర్న్ టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి డబుల్ లాయల్టి బోనస్ పాయింట్లను కూడా కేటాయించనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు