దేశంలో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్.. ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు

ఠాగూర్

గురువారం, 12 జూన్ 2025 (13:54 IST)
దేశంలో కరోనా కొత్త వైరస్ ఒకటి వెలుగు చూసింది. ఇది సార్స్ కోవ్ 2 అనే వైరస్ సహజ పరిణామమేనని అంటున్నారు. ఈ కొత్త వైరస్‌కు ఎక్స్ ఎఫ్.జి. వేరియంట్ పేరు పెట్టినట్టు ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. ఈ కొత్త రకం వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరుతున్నారు. 
 
మరోవైపు, ఈ యేడాది దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. జనవరి జూన్ 11 వరకు దేశంలో కోవిడ్ 19 సాధారణ కేసులు ఏడు వేలకు పైగా నమోదయ్యాయి. 74 మంది చనిపోయారు. ఈ కేసులు తీవ్రమైనవి కానప్పటికీ, ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఐసీయూ పడకలు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచన చేసింది. 
 
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో మరోసారి భయాందోళనలు కలుగుతుండగా, భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) మాజీ డైరెక్టర్ డాక్టర్ బలరాం భార్గవ మాత్రం ఆందోళన అక్కర్లేదంటున్నారు. కోవిడ్ 19 వ్యాధిని కలిగించే సార్స్ కోవ్ 2 వైరస్ సహజ పరిణామమే కొత్త ఎక్స్ ఎఫ్.జి వేరియంట్ అని దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలేగానీ ఆందోళన అక్కర్లేదని ఆయన భరోసా ఇచ్చారు. 
 
దేశంలో ఇంతవరకు 206 ఎక్స్.ఎఫ్.జి. కేసులు నమోదయ్యాయని, వీటిలో అత్యధికంగా 89 కేసులు మహారాష్ట్రలో నమోదైనట్టు ఆయన చెప్పారు. ఎక్స్.ఎఫ్.జి ఇంకా తీవ్ర రూపం దాల్చలేదని తెలిపారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ద్వారా ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించవచ్చని డాక్టర్ భార్గవ పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు