మగవారి మధ్య మేటి నేతగా ఇందిరా గాంధీ సత్తా చాటారు : నితిన్ గడ్కరీ

మంగళవారం, 8 జనవరి 2019 (09:41 IST)
మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే మగవారి మధ్య మేటి నేతగా ఆమె ఉన్నతస్థాయికి ఎదిగారని ఆయన గుర్తుచేశారు. పైగా, తన వ్యక్తిగత ప్రతిభతో ఆమె రాణించారని కొనియాడారు. 
 
నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళా రిజర్వేషన్లు అనే అంశంపై ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల హోదా పొందకుండానే మగవారి మధ్య మేటి నేతగా నాడు ఇందిరా గాంధీ తన సత్తా చాటుకున్నారని ప్రశంసలు కురిపించారు. ఎంటువంటి రిజర్వేషన్ సౌకర్యం పొందకుండానే ఆమె తన పాలన సాగించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
 
అలాగే, ఆయన తన సొంత పార్టీలోని మహిళా నేతలైన సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, సుమిత్రా మహాజన్, స్మృతి ఇరానీ వంటి, నిర్మాలా సీతారామన్ వంటివారు కూడా ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం లేకుండానే రాజకీయాల్లో దూసుకెళుతున్నారని కొనియాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు